నారాయణ శతకము గురుని విశిష్టత

on 0 comments Read Full Article

                      నారాయణ శతకము

పరిష్కర్త -పాతూరి సీతారామాంజనేయులు
                                                                   
                           గురుని  విశిష్టత

వేదాంత వేదియైన,సద్గురుని- పాద పద్మములు  చెంది
యా దయానిధి కరుణచే, సద్బోధ-మందవలె   నారాయణా!

ఏవిద్యకైన గురువు,లేకున్న-నా విద్య పట్టు పడదు
 కావునను నభ్యాసము ,గురుశిక్ష -కావలెను నారాయణా!

గురుముఖంబైన విద్య ,నెన్నికై-కొనిన భావజ్ఞానము,
చిరతరాధ్యాత్మ విద్య,నభ్యసిం -పగలేదు నారాయణా!అణా

అనపేక్షకుదు సదయుడు,వేదాంతి-నిపుణు డ య్యాచార్యుడు ,
దొరకు టపురూప మపుడు,గురుతైన-గురియొప్పు నారాయణా!

అట్టి సద్గురుని వెదకి,దర్శించి -యా మహాత్ముని పదములు,
పట్టి కృతకృత్యు డౌను ,సాధకుడు -గట్టిగా నారాయణా!





హరిహరాష్టోత్తరశతనామ స్తోత్రం

on 0 comments Read Full Article

   హరిహరాస్టోత్తర శత నామస్తోత్రమ్ 

శ్రీ శ్రీ కంఠ శ్శ్రీ నివాసో హ్యుమా కాంతో రమాపతి:
త్రిశూల భృ చ్చ క్ర పాణి ర్గంగా ధర మహీధరౌ 
మహాదేవో మహావిష్ణు:ఫాలాక్షఃకమలేక్షణ:
స్ఫటి కాచ్చో ఘనశ్యామో వృషాంకో గరుడధ్వజ:
పురారాతిర్మురారాతి ర్గిరీసో గిరిధా రక:
కృత్తివాసా పీతవాసా శ్శంకర శ్రీకర స్తథా :
మహేశ్వరో మహీకాంత: పంచ వక్త్రో హయానన: 
కామేశ స్సున్దరా కార:శ్రీ బిల్వ స్తులసీప్రియ:
   సదాశివ స్సదానందో  బిల్వ కేశశ్చ కేశ వ:
విష్ణు బాణో మోఘ బాణోగజారీ    గజ రక్షక:
స్కంద తాతో బ్రహ్మ పితా నటే శ :ఫణి తాండవ:
హలాస్యనాథో రంగేశో దృగాయుధ గదాధరౌ 
విశ్వేశ్వ రో విరాడ్రూప శ్శ ర్వ శ్సౌ రీ మృడొ చ్యుత:
దిగంబరాత్మా బుధ్ధా ఖ్య: కపర్దీ పురుషోత్తమ:
కాశీ బృన్దావనా వాసౌ త్రిభంగీశ స్త్రి విక్రమ:
తేజస్త్రయో ద్వంద్వ ద్రష్టి రష్ట మోర్తిర్దశాకృతి:
భూత నాథో జగన్నాథ శ్చంద్ర బర్హావ తంసక :
రుండ మాలా లసత్కంటో వనమాలా విభూ సహిత:
మృగాంక  శ్స్రీ వత్స చిహ్నో జటాచీరో జనార్దన:
దశా భుజ శ్చతు ర్బాహు పశ్వీ శ :పశు పాలక:
సాంబాత్మా సాంబజనకో నాగ వక్ర సుకుండ లౌ ,
ఈశాన శ్శన్శు మారాత్మా హరో   నారాయణస్తథా: 
స్థాణుర్విశ్వన్భర శ్చై వ పుష్పవచ్చక్ర లోచన:
వీరభద్ర:ప్రలంభఘ్నో గురుమూర్త్యాఖు వాహన:
ఈశ: కల్కీ వామదేవో వాసు దేవ: ప్రభు స్స్వ భూ:
మృత్యుంజయో మధు ధ్వంసీ కాలంతో   నరకాంతక:
మొహినీరూప సుప్రీతో మోహినీ రూప దారక:
గణే శ తాతః కందర్ప జనక శ్శ రభో వ్యయ:
బ్రహ్మ సారధ్య సంతుష్టః  పార్ధ సారధ్య  తత్పరః:
కేతకీ శాప కృ త్కృ ష్నో వృ ష తార్క్ష్య సువాహనౌ :
భూ రథా ఢ్యో ముకున్దశ్చ భీమో భీష్మ సుపూజిత:
టంక శంఖాంచిత కర స్స్న పనాలమ్కృతిప్రియ:
పంచాక్షర మంత్రార్ధ:కాల భైరవ  మాధవ:
మార్కండేయ పరిత్రాతృ ప్రహ్లాద పరి పాలక:
కపాల కౌస్తుభధర శ్శీవ రామో భవానఘ:
వేద వాజిత్రిదామస్తఃపార్దాస్త్ర జ్ఞాన దాయక:
ఖట్వాంగ నందక కరో రుద్రాక్ష:కమలాక్షభృత్ ,
సుమేరు సార్జ్న చాపోన్ధ కారి:కైటభ మర్దన:
బాణసద్మ ద్వారపాల బలీంద్ర ద్వారపాలక:
నాగేంద్ర హార పర్యంకో భయ కృ ద్భయ నాశన:
వటమూ ల  తటా వాసీ వటపత్ర పుటేశయ:
మహాలింగ సమూ ద్భూత: సభాస్తంభ సముద్భవ:
పార్వతీభూషి తార్ధాంగ లక్ష్మ్యా వాస హృదమ్బుజ:
అంగరూపా నంతరూపో లయకృత్ స్థితి కారక:
ఉన్మత్త శేఖర వర జార చోర శిఖా మణి :
జలంధరారి కంసఘ్నః:పరమేశ: పరాత్పర:
భస్మాసుర వరో ధ్ధాతృ ముచుకుంద వరప్రద:
నిత్యానంత శ్చోగ్ర శాంత స్తత్వ సాహస్ర శీ ర్ష క:
పరంజ్యోతి:  పద్మనాభో భృంగి స్త్యుత్య భృగు స్తుతః:
సామ వంశీ గాన లోలో భవ్య దామోదర స్తథా :
భవ రోగ భిష గ్ధన్వంతరి:కామార్య ధోక్షజ:
ఊర్ధ్వ కేశ హృ షీ కేశ: క్రతు ధ్వంసక రక్షక:
భస్మ చందన లిప్తాంగో భీమేశ మధు సూధన:
రుద్రో పేన్ద్ర శ్శమ్భ రారీ ర్జటా జూట కిరీట భృ త్ 
కైలాస వైకుంఠ వాసీ వాసుకీ జన సుప్రద:
కిరాత రూప గోవింద:పంచ బ్రహ్మాత్మక ధృవ:
శ్రీరాజరాజ వరద రాజేన్ద్రాన్వయ పాలక:
ఇదం హరి హరే శస్య నామ్నామశ్టోత్తరమ్ శతమ్ 
సర్వ పాప ప్రశమనమ్ సర్వ సామ్రాజ్య దాయకం 
అనేన పూజ్యయే ద్యస్తు సదేవస్య ప్రియో భవేత్ 
ఇతి హరిహరా ష్టో త్తర శత నామ స్తోత్రమ్ 

కార్తీక మాసం ఒక్క శివుని కోసమే కాదని ,విష్ణు భగవానుని కూ డా   సేవించమని పెద్దలు చెపుతారు. ఈ స్తోత్రం తో వీరిని  సేవించండి.  



                             

హర హర మహా దేవ్

on 0 comments Read Full Article

                 హర హర   మహాదేవ్

సత్య సనాతన  సుందర     శివ -సబకే    స్వామీ -అవికారీ అవినాశీ - అజ అంతర్యామీ !
ఆది   అనంత   అనామయ -సకల  కళా దారీ -అమల -ఆరూప అగోచర   అవిచల   అఘ హారీ !హరహర
బ్రహ్మా,విష్ణు ,మహేశ్వర   తుమ్    త్రిమూర్తి   దారీ-కర్తా,భర్తాధర్తా    తుమ్ హీ     సంహారీ !
రక్షక్ ,భాక్షక్  ,ప్రేరిక్ ప్రియ    ఔధరదానీ -సాక్షీ  పరమ    ఆకర్తా,కర్తా,అభిమానీ!  హరహర
మణిమయ   భవన  నివాసీ -అతి  భోగీ    రాగీ!-సదా శ్మశాన-విహారీ  యోగీ    విరాగీ!
ఛాల్కపాల్   ,గరల     ముండ  మాలా ,వ్యాలీ -చితా   భస్మ  తను ,త్రినయన ,అయన     మహా కాళీ !హరహర
ప్రేత ,పిశాచ ,సుసేవిత ,పీట  జటా దారీ-వివ సన   వికట    రూప ధర రుద్ర   ప్రళయ  కారీ !
శుభ్ర,సౌమ్య ,సురసరి ధర ,శశిధర   సుఖ కారీ -అతి కమనీయ ,శాంతి కర శివ,ముని మన హారీ!హరహర
నిర్గుణ -సగుణ ,నిరంజన    జగమయ   నిత్య   ప్రభో-కాల రూప   కేవల హర -కాలాతీత    విభో!
సత్ ,చిత్,ఆనంద ,రసమయ   కరుణా మాయ   దాతా-ప్రేమ,సుధా,నిది ,అఖిల విశ్వ -త్రాతా !హరహర
హమ్  అతి   దీన దయామయ-చరణ శరణ  కీజై -సబ్   విధి     నిర్మల మతికర అపనా కర లీజి    హరహర
          ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
పాత పాట    ఎవరు   వ్రాసారో    తెలియదు . అనంగీకారమైతే    తొలగిస్తాను,తెలియ చెయ్య   మని    వినతి .

పరమేశ్వర ప్రార్ధన

on 0 comments Read Full Article

               శివస్తుతి                పరమేశ్వర ప్రార్ధన

          శృంగారపురంలొ   నివసించిన   శ్రీ నాగేశ్వరం   సుందర శర్మ గారు  శ్రీ భగవన్నామ సంకీర్తన మాల అనే  కీర్తనలు రచించి పుస్తకం ప్రకటించారు.ఇది అమూల్యం .భక్త వరేణ్యులకు   ఒక్కొక్కరికి    ఒక్కొక్క పుస్తకం ఉచితంగా పంచాలని సంకల్పించి   ఆ రోజుల్లొ   పోస్ట్ ఖర్చులకు   రెండు అణాల పోస్ట్ బిళ్ళలను పంపిస్తె    పుస్తకం పంపుతానని   వెనక అట్టమీద ప్రచురించారు.ఆపుస్తకం   యాదృచ్చికం గా    నాదగ్గరికి చేరింది.  శివ స్తుతులు   హృద్యమంగా వున్నాయి.  కార్తీక మాస సందర్భంగా    వీటిని   గుడిగంటలు  బ్లొగ్ మిత్రులకు   అందిద్దామని   అనిపించింది.  విజ్ఞాపన లో విళంబి ,అధిక శ్రావణం ,13, సోమవారం అనివుంది. రచయితకు   కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
జ్ఞాన ప్రసూన
                    పరమేశ్వర ప్రార్ధన
       శ్లోకము
       మాతాచ పార్వతీ దేవీ ,పితాదేవో మహేశ్వర:
       బాంధవా: శివ భక్తాచ ,స్దేశొ భువన త్రయం
                  కల్యాణి రాగం -ఆట తాళం
             దేవాది దేవా బ్రోవ రావా
             దేవ బ్రోవా వేగ రావా
             దేవా-కావా-రావా-శివా    దే
        1.ఆదిమధ్యాంత రహితా -ఆనందమయ  సుచరితా
          వేదవిహిత యోగివినుత-ఆది దేవ అమర వందిత     దే
        2.జగములను సృజించి -మరితగునేర్పునబెంచి
          పగలేక యడంచి -జగములేలు నీ లీలనుంచి      దే
        3.సర్వ వేద  కర్త వీవె -సర్వ మత ప్రవక్త వీవె
          సర్వ భక్త  గమ్య మీవె -యుర్వి భేదము లణచి కావవె   దే
        4.రజత గిరి నివాసా -రంజిత గౌరి విలాసా
          విజిత మన్మధ రోషా -భుజ భూష  భక్త సుపోష      దే
        5.మూడు కనులు గల్గు వాడా -చూడుము దయ నను చంద్ర చూడా
          వేడితి గంగను దాల్చు రేడా - వేగమె కావర -తెల్లరేడా  దే
        6.దాపుజేరితిని మంచి-ప్రాపు నీవనచునెంచి
          [నా] పాపముల ద్రుంచి -కృప వహించి దీనుని గాంచి     దే
        7.అన్ని జన్మములలో-హన్న  మానవ జన్మములో
         నిన్ను సన్నుతింపక ,మదిలో-బన్నుగ జన్మ తరింపదు -భువిలో దే
        8.తనయులు తగు భార్య యున్న-
          ధనగృహ క్షేత్రాదులున్న -తన తోడుత రాకయున్న
          తన విధి తప్పింప లేరన్న                              దే
        9.తల్లితండ్రి గురువు నీవే -యెల్ల బంధు మితృ లీవే
          కల్లగాదు నా   దైవము నీవే -వల్లభ- కరుణించిరావే  దే
        10.స్నాన సంధ్య జపము -దాన ధర్మ  తపము
           జగద్ వల్లభ కరుణించి రావే                           దే
        11.ధరను వెలయు శృంగార -పుర విహార మల్లేశ్వర
           వర సుందర నుత ధీరా -కరుణ రత్న హార మిదే గొనర దే
                 

దీపావళి శుభాకాంక్షలు

on 0 comments Read Full Article


విజయదశమి శుభాకాంక్షలు

on 0 comments Read Full Article



             విజయదశమి శుభాకాంక్షలు

హరిద్రా గణపతి

on 0 comments Read Full Article

హరిద్రా గణపతి 

దక్షిణేశ్వరీ స్తవము

on 0 comments Read Full Article




               దక్షిణేశ్వరీ స్తవము
రచన -శ్రీశ్రీశ్రీ అనుభవానంద స్వామూలవారు 
చ -అనుపమవిక్రమోజ్వల మహాద్భుత శక్తిచరా చరంబులన్ 
గని భరియించి తల్ల యమకామ్యత చేయు నచిన్త్య లీలలో 
మునుగుచు,తేలుచుందు వట మూర్తి వహించిన మృత్యువోయనన్ 
నిను నెటుజేరువాడ  జననీ!కరుణామయి   !దక్షిణేశ్వరీ!

   అమ్మా! దక్షిణేశ్వరీ !కరుణామయీ!చరాచర సృష్టి ,స్థితి ,లయముల నిష్కామంగా చేయుచూ ,మనస్సున కందని లీలలో   మునుగుచు ,అపర మృత్యువోయనునట్లుండు నిన్ను ఏవిధంగా   చేరేది?
ఉ -చండిక!యెట్లు నిన్ గన !ప్రచండ పరాక్రమ విక్రమప్రభా 
ఖండ విభూతి మూర్తిరో !అగాధ మహా ప్రలయాభ్ది రూప!బ్ర 
హ్మాండ నికాయ సంస్థిత మహాద్భుత గర్భ నిబద్ద రూ పిణే!
దండము భావ దూర !వినుతా!ప్రతిభాయుత !దక్షిణే శ్వ రీ!
   అమ్మా!  చండికా!ప్రచండ పరాక్రమ ప్రభామూర్తీ ,మహా ప్రళయా భ్ధి రూపిణీ!భావదూరా!ప్రతిభా స్వరూపిణీ!సర్వ ప్రపంచాన్నీ గర్భంలో   ధరించిన నీకు నమ స్కారము. ఈ విధంగా వున్న  నిన్ను     చూచేదేట్లా ? 
3  . చం -భవుడు లయింప,మాధవుడు పాలన సేయ ,సృజింప  పద్మ 
సంభవుడు ,శక్తి నీవిడక    వారికి సాధ్యమే!ఏల భ్రహ్మమే 
అవశత నీ కధీనమయియాడుట కీర్తి వహించే బ్రహ్మగా 
భవతరణీ !మహా ప్రతిభ !భావ విలక్షిణి దక్షిణే శ్వరీ!
     అమ్మా!భావతరణీ!భావ విలక్ష ణీ !మహాప్రతిభా!నీవు నీదివ్య శక్తిని ప్రసాదింప కున్న ఆ  బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు ,సృష్టి ,స్థితి, లయాలను చేయగలరా?అసలు  ఆబ్రహ్మమే నీకు స్వాధీనమై    యున్నది కదా? 
4-ఉ -అల్ప మదెట్లు నీవు జగదంబ!పరాపర శక్తి బ్రహ్మాసం 
కల్పమ !నాద బిందు కళ కాల  మహేశ్వరీ!భద్రకాళీకా!
సల్పవె నిర్గుణున్ సగుణు !సర్వమెయొఉదువు!నీవు మాయవే!
కల్పనవేయవిద్యవట కల్ల  పదంబులు!దక్షిణేశ్వరీ 

                  అమ్మా! మహేశ్వరీ!భద్ర కాళికా !బ్రహ్మ సంకల్పమా!నాదబిందు కళా స్వరూపిణీ!కాల రూపిణీ!మహేశ్వరీ!జగదంబా!పరాశక్తి!నిర్గుణ బ్రహ్మాన్ని సగుణం చేస్తున్నావు . సర్వమూ  నీవేకదా. అట్టి నీవు అల్పం ఎట్లా అవుతావు?నీవు మాయవని,కల్పనా వని ,అవిద్య వని చెప్పటం అబద్ధమే!
5-ఉ -దాత,శివుండు ,విష్ణువు సదా పరిచర్య జరించి వీడరె 
ఏ తృటి గాని నిన్ను  ,ఇక ఈశ్వరి ,లక్ష్మి,సరస్వతుల్ గుణో 
పేతవు నీదు సేవ గడు ప్రేమ మునుంగుచు నుండ్రు ,కాన నే 
రీతిగా బోలరారు సురలెవ్వరు నీకును దక్షిణే శ్వ రీ!
                         అమ్మా!బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు మువ్వురు ,వారి శ క్తులైన వాణీ లక్ష్మి పార్వతులు మువ్వురు సద్గుణ రాశివైన నిన్ను ప్రేమతో సదా సేవిస్తూ వుంటారు. ఆ దేవతలు కూడా నీకు సరిరారు. 
6-ఉ -కాశీ గయాది క్షేత్రములు  సరస్వతీ  తీర్ధముల్ 
నీశరణొన్ది  పాదముల నిత్యమూ నుండగా వాని సంసృతీ 
పాశ విముక్తికై  వమ్ముగదా !నిను గొల్వ బూర్తిగా 
నాశము నొందు బాపమని నమ్ముదు నెప్పుడు దక్షిణే శ్వ రీ !
        అమ్మా!కాశీ   గయాది క్షేత్రాలు , క్షేత్ర స్థ గంగా, తీర్ధాలూ నీపాద పద్మాల్ని   ఆశ్రయించి ,  నిన్ను శరణు పొందగా ,యిక వాటిని    ఆశ్రయించడం ఎందుకు?నిన్ను ఆరాధిస్తే చాలు పాపం నశి స్తుందని  నా విశ్వాసమ్
7-చం -సకల చరాచరంబులు ప్రశస్తిగ నిండి యనన్యవ్రుత్తి వ్యా 
పాక గుణశక్తి బ్రేమమయవై వేలుగొండుచు నుండ నింక నే 
వికృత మనమ్బుతోభయద వ్రుత్తి జరిమ్పగా నేలనమ్మ !నీ 
ప్రకటిత వైభవంబు గన రాకనుగాదోకో !దక్షిణే శ్వరీ !
                   అమ్మా!నీవు సర్వ చరాచరములలో నంతర్గతి వై అంతటా వ్యాపించి,ప్రేమ మయివై ప్రకాశిస్తూ వుంటే ,నేను వి కారమును పొంది భయం పొందటం ఎందుకు?కారణం  నీ ప్రాశస్త్యాన్ని గ్రహించక పోవడమే!
8-ఉ -శ్రీ గుణమైన సత్వమున  సృష్టిని  బ్రేమ లయించినావు ఆ 
పైగొని రాజసంబు పరిపాలన ప్రేమతో చేసినావు ,ఉ 
ద్వేగ తమంబునన్ జగతి ప్రేమ సృ జించితి వమ్మ,కాననీ 
వేగద సృష్టి మూలము వివేకముతో గన  దక్షిణే శ్వరీ !
               అమ్మా!తమోగుణం తో ఆ  సృష్టిచేసి ,అంత రజోగుణం  రజోగుణం తో  ఆ సృష్టిని   పోషించి ,ఆ పైనశ్రే ష్టమైన  సత్వ గుణం తో   మరల    ఆసృష్టిని లయింప జెస్తున్నావు. సర్వ సృష్టికి మూల కారణం   నీవేగదా!
9-ఉ -భావ విదూరమౌ ననుభావాదులు ,వాని కతీత వీవు నిన్ 
భావన జేసి నిన్ దెలిసి వ్రాయుట సాధ్యములే !వచింప గా
బోవుట హాస్యమౌననుచు బుద్ధికి తోచుట విశ్వ సింతు నో 
పావని!భానుకోటి విభవా!పరమేశ్వరి !దక్షిణేశ్వరీ !
        అమ్మా!  పావనీ!పరమేశ్వరీ !భానుకోటి విభవా!అనుభవం భావాతీతం గదా!భావాతీత వైన ని న్ను భావించి  వ్రాయడం సాధ్యమా!ఇక నిన్ను గూర్చి   వచించుట   హాస్యా స్పదంగా   విశ్వసిస్తున్నాను
10-ఉ -అక్షర సంపుటీకరణ మౌ సకలాగమ శా స్త్ర పంక్తి నీ 
వక్షము పైని హారముగ భాసిలుగాని హృదంత రాళమున్ 
వీక్షణ చేసి చెప్పగలవే!నిజతత్వ మెరుంగనే!విశా 
లాక్షి !విమోక్ష లక్ష్మి !ఉమా!సాక్షి !సురక్షణి !దక్షిణే శ్వరీ !
                      అమ్మా!విశాలాక్షి !విమోక్ష లక్ష్మి!ఉమా!సురక్షిణి!అక్షర సమూహములతో కూడియుండు సర్వ శాస్త్ర సంచయము నీ    హృదయముపై హారముగా నున్నవి  
 కాని ఆ శా స్త్ర పంక్తి నీ హృదయాన్తరమును ,నీ నిజ తత్వాన్ని గ్రహింప గలవా!

అడివి ఆంజనేయ స్వామి నూజివీడు

on 0 comments Read Full Article

అడివి     ఆంజనేయ స్వామీ        నూజివీడు
                మాతాతగారి వూరు నూజివీడు . సాకు    దొరికి నప్పుడల్లా     వెళ్ళిపోయేవాళ్ళం ఇంటి చుట్టూ పళ్ళ చెట్లు ,పూల మొక్కలు వుండేవి. ఒపదిమంది  పిల్లలు వుండే వారు . కనకాంబరాలు,గన్నేరు పూలు,  రాధా మనోహరాలు,  జాజి పూలు , మందారాలు చెట్టు కనిపించకుండా  పూసెవి . పిల్లలు తలోపూల మొక్కా దత్తత  తీసుకొని జాగ్రత్తగా   నీళ్ళుపోసి,ఎరువులు వేసి  పెంచెవారు.
                                          మాతాత గారు కొనేటిపేట లో వుండేవారు.  పెద్దకోనేరు,మెట్లు వుండెవి. ఆగట్టు వెంటే  నదిచెవాళ్ళమ్.   అడివి   ఆంజనేయ స్వామీ   గుడి వూరికి దూరంగా  వుంటుంది .ఇప్పుదు వూరుపెరిగిపోయి  అన్తాకలిసిపొయిన్ది. కోనేటిపేట నుంచి దూరమే గుడికి వెళ్ళాలంటే    అదొక    పెద్ద ప్రయాణం . ఆవూళ్ళో ఔటింగ్లు రెండే   ,ఒకటి ఆంజనేయ స్వామీ    గుడి,రెండోది     సినిమా . ఎక్కడికన్నా వెళ్ళాలంటే   మధ్యాన్నం నుంచి ప్రయాణ సన్నాహాలు జరిగెవి.  పెరట్లోని కనకాంబరాలు కోసి   ఆంజనేయ స్వామికి    దండ  కట్టి పట్టు కెళ్ళాలి అప్పుడు అందరిచేట్ల పూలు ఇచ్చెసెవాళ్ళు  . కనకామ్బరాలుకాదాలు సన్నగా  వుంటాయి నెమ్మదిగా  దారం ముడివేసి లాగాలి లేకపోతె కత్తిరించుకు పొతాయి.   రెండుపూలు బొత్తిగా పెడితే ఒకళ్ళు మాల  ఒత్తుగా  కట్టే వారు.  నాయకత్వం,శిష్యరికం, పోట్లాటలు జరిగెవి.ఒక కొబ్బరికాయకొని పిల్లలందరం    నడిచి వెళ్ళెవాళ్ళమ్.   పరీక్ష పాస్ చేయించమని,  పండక్కి పట్టు పరికిణా    కుట్టించమని,   జడ పొడుగ్గా  ఎదగాలని  ,ఎవోకొరికలు  ఆంజనేయ స్వామికి      నివేదించే వాళ్ళం . చల్లగాగుడి ఆవరణలో కూర్చుని కొబ్బరిముక్కలు ప్రాసాదం   తిని నడిచి ఇంటికి చెరెవాళ్ళమ్.   ఆంజనేయ స్వామీ ఒక చెట్టుకింద వుండేవారు,పక్కనే వేణు  గోపాల   స్వామీ నిలబడి వుంటాడు.  ఆంజనేయ స్వామికి పైన కప్పు,ఆచ్చాదన  ఇష్టం లేదని ఏమీ   చెయ్యలెదు. ఆభరణాలు వుండేవి కావు. ఈమధ్య    పైన ఆచ్చాదనగా  కప్పువేసారు చుట్టూ గోడ  కట్టారు .మాకు ఏమిటోగా    అనిపించిన్ది.  కానీ ఇప్పటికి ఒక్కరొజుకోసమ్   వెళ్ళినా సరే   అడివి ఆంజనేయ స్వామీ దర్సనం   చేసుకోకుండా   రాము.  ఇంతవరకు అలా  జరగా లేదు.   మా  తాత గారు చనిపోయాక మా  పిన్ని గారు   యిల్లు కొనుక్కొన్నారు అందుచేత ఇప్పటికి తరుచుగా    వెడుతూనే ఉంటా మొ న్న జులై లో వెళ్లి నపుడు   ఫోటో తీసాను.  

"రాధికేశ్వరా!" పద్యాలు

on 1 comments Read Full Article

                        రాధి కేశ్వరా !

    కృష్ణ!కృపాలవాల   హరి కృష్ణ  పరాత్పర    కృష్ణ రుక్మిణీ 
    కృష్ణ !  సమస్త    లోక   నుత   కృష్ణ   జనార్దన   కృష్ణ ద్వారకా 
    కృష్ణ !సుదర్శ నాభరణ కృష్ణ    యశోద    ముఖాంబు జార్క  శ్రీ 
    కృష్ణ!    ముకుంద    గోపకుల   కృష్ణ    నిరామయ      రాధి కేశ్వరా !

    కృష్ణుడే   తల్లి తండ్రి   హరి   కృష్ణుడే     నా  ఇలవేల్పు రాధికా 
    కృష్ణుడే    తోడూ నీడ ,  ఇక     కృష్ణుడే    చుట్టము  పక్కమున్   సదా 
    కృష్ణుడే     దిక్కు నాకనుచు   ,  కీర్తన     చేయుచు     జాటు నుంటి నో 
    వైష్ణవ    తేజ   నన్నేతుల   పాలన   జేసేదో!      రాధి కేశ్వరా !

    తలచెద    నీ    కృపారసము     దారిని    బోవుచు సంస్మరించేదన్ 
     పిలచెద,   మోక్ష మిమ్మనెద , వేడెద ,  పాడెద ,విష్ణు భక్తులన్ 
     గలసెద ,    దుర్గుణాల్   విడె ద ,కాంతల    తల్లుల   రీతి    చూచెదన్ 
    నిలచెద  నీ పదాల కడ ,నిన్ను   భజించెద ,  రాధి కేశ్వరా !

   కానుక    నీ కొసంగుటకు   కాసున కైనను    మారనింక    స 
   న్మానము  చేసి   ఇచ్చుటకు   నాకడ   కేవల     మాత్మ   తప్ప   వే 
    రే    నిధి    లేదు ,పేద నని   ఎంచక   నాత్మ   పరిగ్రహించి  ఈ 
   దీనునిపై   ననుగ్రహము   తేటగా    జూపర,    రాధి కేశ్వరా !

          ***********************************
 ఈపద్యములు     వ్రాసిన   రచయిత    ఎవరో    తెలియదు.   రాధికెశ్వరా   అనె    శతకం    రచించారెమో!  పద్యాలు హృద్యమం   గా      వున్నాయని 
సాహితీ    మిత్రులకు     అందిస్తున్నాను .  అజ్ఞాత    కవికి    కృతజ్ఞతలతో 
టి .    జ్ఞాన    ప్రసూన 

సూర్య మహిమ

on 0 comments Read Full Article

                                   సూర్య మహిమ
                     శ్రీకృష్ణుని కుమారుడైన    సాంబునికి     శాప కారణంగా     భయంకరమైన   కుష్టు రోగం ప్రాప్తించింది.
సాంబుడు  తండ్రి దగ్గరికి వెళ్లి   "నా కష్టాన్ని దూరంచేయ్యండి.   రోగానివారణకు    ఉపాయం చెప్పండి "అని కోరాడు.
సూర్య భగవానుని     ఆరాధన చెయ్యి నాయనా !నీకు    ఆరోగ్యం వస్తుంది ,నారద మహర్షి  దగ్గర సూర్య  ఆరాధన ఎలా చేయాలో  తెలుసుకో!అన్నాడు.
                      నారద మహర్షి  ఒకసారి   శ్రీ  కృష్ణుని     దర్శనార్ధమై  ద్వారకాపురికి    వచ్చాడు. అప్పుడు సాంబుడు వినమ్రతతో     చేతులు జోడించి ప్రార్ధించాడు. నాశారీరాన్ని    ఆవరించిన  కుష్టు రోగం నివృత్తి అయేలా  ఏదైనా     ఉపాయం చెప్పి   పుణ్యం   కట్టుకోండి   అన్నాడు.
                           సమస్త ప్రాణికోటి  నిత్యమూ ఎవరినయితే     ప్రార్ధిస్తారో,నువ్వు  వారినీ ప్రార్ధిస్తే   నీ  రోగం నయమవుతుంది,నీ   కహ్తాలు గట్టేక్కుతాయి.
             ఆదైవం ఎవరో చెప్పండి,వారి శరణు    వేడుకొంటాను.
             ఆయన ప్రత్యక్ష దైవం    సాక్షా త్తు   సూర్యనారాయణ మూర్తి .మానవులు,దేవతలు నిరంతరమూ ఆయన్ని స్తుతిస్తూ   వుంటారు. ఆయన   ఎంతటి    మహిమ కలవాడో   చేపుతావిను ,ఒకసారి నేను      సూర్య లోకానికి  వెళ్లాను.దేవతలు,గంధర్వులు,నాగులు,యక్షులు ,రాక్షసులు,అప్సరసలు  ఆయనకు సేవలు చేస్తున్నారు.గంధర్వులు     గానమాలపిస్తోంటే    అప్సరసలు నృత్యం చేస్తున్నారు.రాక్షసులు,యక్షులు,నాగులు శ స్త్రాలు   ధరించి  రక్షణ గా  నిలబడ్డారు. ఋగ్వేదము,యజుర్వేదము,సామ వేదము    స్వరూపాలు ధరించి ఆయన్ని స్తుతిస్తున్నారు.ప్రాతః కాలము,మధ్యాహ్నము ,సాయం కాలము మూడు సంధ్యలు సుందర మైన రూపాలు ధరించిచేతిలో వజ్రము,బాణాలు ధరించి నాలుగు వేపులా  నిలబడ్డారు.ప్రాత;సంధ్య   బంగారు కాంతితో వుంది,మధ్యాన్న సంధ్య చంద్రునివలె   శ్వేత వర్ణంలో వుంది.  సాయం సంధ్య మంగళ వలే  విచిత్ర వర్ణాలతో వుంది.
ఆదిత్య,వసు,రుద్ర ,మరుత్,  అశ్వనీ కుమార్మోదలైన దేవగణా లందరూ త్రిసంధ్యాలలో సూర్యారాధన చేస్తున్నారు.
ఇంద్రుడు    ఎల్లవేళలా   అక్కడనిలబడి      జయజయకారాలు పలుకుతున్నాడు. గరుత్మంతుని పెద్ద అన్నసూర్యునికి రథ సారధి .  కాలుని       అవయవాలతో నిర్మించిన సూర్య రధాన్ని అతడు నడిపిస్తాడు. ఛంద  రూపంలోవున్న పచ్చని  ఏడు  గుర్రాలు   ఆరదానికి కట్టి వుంటాయి.  రాజ్ఞి,నిక్షుభ సూర్యుని ఇద్దరు భార్యలు   ఆయన చె రి ఒక వేపు   ఆసీనులై    వుంటారు. చేతులు జోడించి దేవతలన్దరు   చుట్టూ నిలిచి వుంటారు.పింగల్ ,లేఖక్, దండ నాయక గణాలు  ,కల్మాష  అనే రెండుపక్షులు ద్వారపాలకులై వుంటారు.  దిండీ ,బ్రహ్మ ఆయన్ని స్తుతిస్తూ వుంటారు
                     ఈద్రుశ్యం      చూసాక నాకు అనిపించింది,;ఈయనే దేవుడు, సమస్త దేవతలకు పూజనీయుడు :అనిపించింది, నువ్వు ఆ సూర్య నారాయణ మూర్తినే  శరణు వేడుకో!
                             సూర్యనారాయణు డు    సర్వగతుడు ఎలా అయాడు?ఆయన కిరణా లేన్ని?ఆయన రూపాలేన్ని?ఆయనభార్యలైన రాజ్ఞి, నిక్షుభ ఎవరు?పింగాల్,లేఖక్,దండనాయకక్కడ ఏమి చేస్తారు?కల్మాష పక్షి ఎవరు?ఆయన సమక్షం లో వుండే దిండి ఎవరు?నాకు   ఇంకావివరంగా చెప్పండి.అన్నాడు సాంబుడు
                                     వివస్వాన్       దేవుడు అవ్యక్త కారణ,నిత్య,అసత్ రూపం. ప్ర  ధాని,ప్రక్రుతి అని తత్వ చింతకులని అంటారు. వారు గంధ ,వర్ణ ,రస  రహితులు,శబ్ద ,స్పర్శ  రహితులు. సనాతన పర బ్రాహ్మలు. సమస్త ప్రాణులకు నియంతలు.     అనాది,అజ, సూక్ష్మ ,త్రిగుణ,నిరాకార,అవిజ్నేయ ,  పరమ పురుషులు.  ఈమహాత్ముడైన భగవాన్  సూర్యునిచే ఈజగత్తు పరివ్యాప్తమై వుంది.   ఈపరమెస్వరుని ప్రతిమ  జ్ఞాన ,వైరాగ్య లక్షణాలతో    విల సిల్లు తో వుంటుంది. వీరి బుద్ది   ధర్మమూ,ఐశ్వర్యము   ప్రసాదించేది.ఈభగవానుదు ఏది కోరుకొంటే  అది జరిగి తీరుతుంది.సృష్టి రచనా సమయం లో వీరు బ్రహ్మ మూర్తులు,ప్రళయ కాలంలోకాలరూపులు.పాలనా  సమయంలో విష్ణు స్వరూపులు.ఆదిదేవుడు గనుక ఆదిత్యుడు,అజాతుడు గనుక అజ అయి వున్నాడు.దేవతలలో గొప్పవాడు కనుక మహాదేవ్ అంటారు.సమస్త ప్ర జానీకాన్ని పాలించి,రక్షిస్తాడు కనుక   ప్రాజాపతి అయాడు.హిరణ్యా న్డం లోవుండటం వలన హిరణ్య గర్భుడు .దిశలకు ప్రభువు,దేవతలకు దేవుడు,గ్రహాలకు ఈశుడు కనుక దివాకరుడు అయాడు.ప్రళయ కాలం లో స్థావర జన్గామాలన్ని నశించి పోయినప్పుడు ప్రపంచం అంటా ఒక మహా సాగరం అయినప్పుడు ఈయననారాయన రూపం ధరించి సముద్రంలో శయనిస్తాడు. ఈయనే ప్రథమ దేవత. నువ్వు ఆయనని శరణు కోరితే ,ప్రార్ధిస్తే తప్పక నీకు శుభం కలిగి రోగము ఉపశమించి  దీ ర్ఘాయువు కాగలవు.అని నారదుడు చెప్పి నిష్క్ర మిస్తాడు.
                               ఆరోగ్య ప్రదాత,నేత్ర శక్తి నిచ్చే దేవత శ్రీ  సూర్యనారాయ ణు ని రథ సప్తమి సందర్భం గా తలచుకొని తరిద్దాము
                                 

శ్రీ గణనాధం

on 0 comments Read Full Article

                            శ్రీ  గణ నాదం

 
    శ్రీ గణ నాధం     భజరే చిత్త   పరా శక్తి యుతం
    నాగ యజ్ఞ సూత్ర  ధరం    నాదలయానంద కరం    శ్రీ

   ఆగమాది సన్నుతం  అఖిల లోక పూజితం
  యోగాశాలి   భావితం భోగిశాలి సేవితం

   రాగ ద్వేషాది   రహిత రమణీయ హృదయ  విదితం
   శ్రీ గురు గుహ సమ్ముదితమ్ చిన్మూల కమల స్థితం

       తా -ఓ చిత్తమా!శ్రీ గణపతిని సేవింపుము .పరాశక్తి తో కూడుకొని యున్న  విఘ్న నాయకుని  భజింపుము .
పాములను యజ్ఞో పవీతముగా ధరించిన  వాడును ,నాదము యొక్క పరమ తత్వము లయమొందు  చోట
గ్రీడించు వాడును ,చిత్తము యొక్క అంతరంగమున   వేంచేసి యున్న వాడును,శక్తితో గూడిన వాడును నగు
గణ నాయకుని భజింపు ము .వేదములచే నుతింప బడిన వాడును -సమస్త లోకములచే  పూజింప బడిన వాడును,,యోగము తెలిసిన మహాను భావులచే ద్యానింప బడు  వాడును,  శ్రీ మహా విష్ణు వుచే పూజింప
బడిన వాడు ,నిర్మల మైన హృదయమునందానంద  రూపుడైయుండెడి వాడు,తండ్రి యైన శంకరునికి ,కుమారస్వామికి,మోదము  కలుగ    చేయు వాడు.పంచ కోశా న్తర్వర్తి అయిన పరం చైతన్య స్వరూపుడై ,గురు రూపముతో  నుండు వాడు,జ్ఞాన మూలమగు సహస్రార చక్రమున నున్డువాడునగు వినాయకునికి నమస్కరింపు ము.