వెలుగు

on 3 comments Read Full Article

వెలుగు
వెలుగు వెన్నెల జీవితం
జిలుగు పరదా జీవితం
కలిమి లేముల జీవితం
కళ్యాణ సంపద జీవితం
విద్య నేర్చిన జీవితం
విలువ నందే జీవితం
సేవ నేర్చిన జీవితం
ఎద సేద తీర్చిన జీవితం
అలుపెంగని జీవితం
ఆనంద ఝరి ee జీవితం

నవరాత్రి వంటకాలు,పూజలు ,రంగులు

on 3 comments Read Full Article

నవరాత్రి వంటకాలు,పూజలు,రంగులు
నవరాత్రి వచ్చేసింది.కలుష హారిణి,శక్తి స్వరూపిణి ,శత్రు సంహారిణి ,సిద్ది దాయిని మూలపుటమ్మ ముంగిలిలోకి వచ్చింది.ప్రశాంతంగా ,ప్రమోదంతో
నిండిన భక్తి విశ్వాసాలతో అమ్మను కొలవండి. లోట్లు ,సమస్యలు,చికాకులు పక్కకు పెట్టి మనసా వాచా కర్మణా దుర్గా దేవిని పూజించండి. ఏపని చేసినా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే సులువుగా వుంటుంది. ఎలాచేయాలి,ఏమిచేయాలి అనే ఆదుర్దా తగ్గుతుంది. సోదరీ లలామ లకు నాకుతెలిసిన,విన్న పద్ధతి చెపుతున్నా. బాగుంటే ,వీలయితే అనుసరించండి.
అందరికి దసరా శుభా కాంక్షలు
ఈ మాటు దసరాలు శుక్రవారంతో ప్రారంభ మవుతున్నాయి ,అందుకని శుక్ర వారం నుంచి వంటలు అవి ఏమిచేయాలో వ్రాసాను.
శుక్రవారం మొదటిరోజు -అమ్మవారికి ముద్దపప్పు ,ముక్కల పులుసు రొజూ వుండాలి,కూరలు,పచ్చళ్ళు, పిండివంటలు మారుతాయి.అందుకని పులుసు ,పప్పు అని రోజు చెప్పడం లేదు.తక్కినవి చెపుతున్నాను.
బీరకాయ కూర,చింతకాయ పచ్చడి .పులగం.మొదటిరోజు అమ్మవారికి ఆహ్వానం పలికి ప్రతిష్ట చేసేసరికి టైం పడుతుంది.అందుకని మొదటిరోజు తేలికగా పులగం చేస్తారు. ఈరోజు చిలక పచ్చ రంగు చీర ధరించాలి.ప్రతిరోజూ దుర్గా అష్తోత్తరంగాని, లలిత అష్టోత్తరం గానీ చదవాలి ,శుక్రవారం లక్ష్మికి ప్రీతి అయిన రోజుకనుక లక్ష్మి అష్టోత్తరం చదివి పూజ చేసి పాయసం నివేదన చేయాలి.
శనివారం రెండవరోజు -ఈరోజు వంకాయ కూర ,కొబ్బరి పచ్చడి, పెరుగు అన్నం నివేదన .కాషాయరంగు చీర ధరించాలి.శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన రోజు ,శ్రీ వెంకటేశ్వర స్వామీ అష్టోత్తరం చేసి ఆయనకీ చిత్రాన్నం నివేదన చేయాలి.
ఆదివారం,మూడవరోజు -సొరకాయ కూర,దోసకాయ పచ్చడి,బెల్లం అన్నం ఏలకులు,జీడిపప్పు వేసి నివేదన,పసుపు పచ్చ రంగు చీర ధరించాలి.ఆదివారం సూర్యునికి ప్రీతి ఐన రోజు సూర్యుని అష్టోత్తరం చదివి పాయసంనివేదన చేయాలి.
సోమవారం ,నాలుగవ రోజు -అరటి కాయ కూర,నేతి బీరకాయ పచ్చడి ,కొబ్బరి అన్నం నివేదన.ఆకాశ నీలం చీర ధరించాలి.సోమవారం శివునికి ప్రీతి అయిన రోజు.శివాష్తోత్తరంచదివి పాయసం నివేదన చేయాలి.
మంగళ వారం,అయిదవ రోజు-కంద కూర,బీరకాయ పచ్చడి,అన్నం పాయసం నివేదనగులాబీ రంగు చీర ధరించాలి..మంగళ వారం ఆంజనేయ స్వామికి ప్రీతి అయిన రోజు.ఆంజనేయ స్వామీ అష్టోత్తరం చదివి అప్పాలు నివేదన చేయాలి.
బుధ వారం ఆరవరోజు -చేమ దుంపల కూర ,టమాటో పచ్చడి,పులిహోర నివేదన.ఆకుపచ్చ రంగు చీర ధరించాలి.బుధవారం సరస్వతికి పూజ.అష్టోత్తరం చేసి సొజ్జ పూరీలు నివేదన .
గురువారం,ఏడవరోజు-చిక్కుడు కాయ కూర,వంకాయ పచ్చడి.సిరా రంగు చీర ధరించాలి.కలగాయకూరల అన్నం నివేదన.ఇందులో మిరియాలు,జీలకర్ర పోపు వెయ్యాలి.గురువారం సాయిబాబా కు ప్రీతి అయిన రోజు.సాయి అష్టోత్తరం చేసి,రవ్వలడ్డు నివేదన .
శుక్రవారం,ఎనిమిదవ రోజు-బెండకాయ కూర,అల్లం పచ్చడిగారెలుin నివేదన.రాయల్ బ్లూ చీర ధరించాలి.శుక్రవారం లక్ష్మికి ప్రీతి అయిన రోజు.లక్ష్మి అష్టోత్తరం చదివి చక్కర పొంగలి చేసి నివేదన చెయ్యాలి.
శనివారం తొమ్మిదవ రోజు-పనస పొట్టు కూర,లేక కాబేజీ కూర ,గోంగూర పచ్చడి,బూరెలు
నివేదన ఎర్ర రంగు చీర ధరించాలి.
ఇవన్ని మీ సౌకర్యం పట్టి ఆచరించ వచ్చు.కొత్త చీరే కట్టాలనిలేదు.
ఒకసారి కట్టిన వైనాకట్టవచ్చు .కాకపొతే ఆచీరతో భోజనం చెయ్యని దయితే చాలు.లేకపోతె పట్టు చీరలు వుండనే ఉంటాయిగా! అన్నిరంగులు ఇప్పుడు కోనేసుకోన్నరనుకోండి ఇక ఏడాది పొడుగునా మీవారిని చీరలుకొనమని
సతాయిన్చానక్కరలేదు.

అసంభవం

on 0 comments Read Full Article

అసంభవం
సేవక సుఖ చహ మాన బిఖారీ
బ్యసని ధన సుభ గతి బిభి చారీ
లోభి జసు చహ చార గుమానీ
నభ దుహి దూధ చహత ఏ ప్రాని
సేవకునికి సుఖము,బికారికి సన్మానము,వ్యసన పరునికి ధనము,వ్యభిచారికి సుభగతి , లోభి కి కీర్తి దురహంకారికి నాలుగు ఫలాలు {ధర్మ ,అర్ధ,కామ,మోక్ష}కోరుకొనే వాళ్ళు ఆకాశాన్ని పిండి పాలు తియాలనుకోనేవాళ్ళు.
[ శ్రీ రామ చరిత మానస్ నుంచి ]

శ్రీ లక్ష్మి గణపతి దండకం

on 0 comments Read Full Article

శ్రీ లక్ష్మి గణపతి దండకం
శ్రీ పార్వతేయా! మహాదేవ!విఘ్నేశ !శ్రీ వారణాస్యా గణాధ్యక్ష !భక్తైక రక్షా!సురాధ్యక్ష!వి శ్వే శ ! విరూపాక్ష పుత్రా! సర్వాగ్ర సంపూజితా!సర్వ రక్షా!
మహా దేవ !దేవేశ !హేరంభ లంబోదరా!శూర్ప కర్ణా!పరానంద!ఆనందరూపా!సురూపా!వరేణ్యా !గణా దీశ !భ్రూ మధ్య సంగోచారా !ధ్యేయ రూపా! సుపద్మాసనస్తా !గుణాతీత !రుద్ర ప్రియా!విశ్వ కర్తా!విభో!విశ్వ భర్తా!కిరీటి !గవర్ణ ప్రియా!సర్వ నేత్రాధీవాసా !సుసుద్ది ప్రదా! సిద్ది నేతా!నట త్రాతా!సర్పాళి సంభూషితాంగా!సుయజ్ఞ స్వరూపా!
సుమంత్రాత్మ!కైలాస మందీవు నీయింపు సొంపుల్ వెసన్ జూపుతున్ గుజ్జు రూపంబునన్ ,బాల వేషంబునన్ ,సోదరున్ కొమలాగున్ మహా ప్రీతి వేజేరి నీతోన్దమున్వాని కంఠంబు పై వేచి హస్తంబునన్ హస్తమున్బట్టి లాలించుచున్ రమ్య మైనట్టి యారామమున్ జేరి యానంద చిత్తంబుతో నాటలాడంగా నీ తల్లి దండ్రుల్ మహాదేవుడున్ గౌరియున్ మిమ్ము వేజేరి మీయాటాలన్ పాటలన్ చూచి సమ్మోద సంపూర్ణ చేతస్కులైరవ్యయా!నీదు తత్వంబు సన్మౌని సధ్యాన గమ్యంబు వి శ్వేస్వ రా ౧సిధ్ధియున్ బుద్ధియున్ నీదు పార్శ్వంబు లన్చేరి సేవల్వేసన్ చేయుచున్దంగా హేమా ధ్య పీఠం బునన్ వెల్గు చున్నట్టి నీ ఠీవి భావించు భాక్తాలికిన్ సిద్దియున్ బుద్ధియున్ గూర్చి రక్షింతువో విఘ్న రాజా!లసద్రూప !చిద్రూప !సద్భక్త కలపా!అనంతా!అపారా!మహాదేవ సూనో!మహావిఘ్నత మిశ్రా బాలార్క తేజా!సులావణ్య తారుణ్య కారుణ్య రూపా!ఉదారా!జడా భాగ!ఎకార పీథ స్త ఇంద్ర ప్రియా !దేవ !ఓంకార రూపా!"భవద్భక్తి నావోద్ధరత్వం దయాళో సుగాత్యం తరన్నాస్తి దేవ ప్రభో మే!యటన్ చెంతు శ్రీ వక్ర తుండా!మహాప్రాణ !వర్షంబులున్ మాసముల్ పక్షముల్ వారముల్ కాల మెల్లన్ దగ న్నీవే గావా!అహోరాత్ర రూపా !సురారాధ్య !సర్వాంత రస్తా !మహారోగ భీ త్యాది నాశా !సుసిద్ది ప్రదా!సర్వ వాంచా ప్రదా!సర్వ సంపత ప్రదా!వారిజాక్షా !సదాచార !వేదాది వేదంగా మీమాంస సాన్ఖ్యాది శాస్త్రంబులున్ కావ్యముల్ పాంచ రాత్రంబులున్ నిన్ను మెప్పిమ్పగా గోరియున్ భక్తికిన్ మిన్నగా నున్డలేక పోయెన్ మహాదేవ !విఘ్నేశ !లక్ష్మి ప్రియా!బాల రూపా!"అనన్యా వలంబం మహా పాప శీలం భవ న్నేత్ర పాత్రం కురుష్వ ప్రభో మాం కటాక్షావ లోకేన కించిత్ ప్రసీదేతి "ప్రార్ధించు చుండున్ మహాశక్తి హస్తా !మహారుద్ర !సంవిత్ స్వరూపా!మహాసౌఖ్య దాటా !విధాతా!సంస్తా పరాధంబులన్ సైచి నన్నేలుకో దేవ దేవా!నమస్తే!నమస్తే!నమ:
రచన సామ వేదం రామ మూర్తి శర్మ కృత జ్ఞతలతో జ్ఞాన ప్రసూన

శ్రీ రామ మంగళాశాసనం

on 0 comments Read Full Article

శ్రీ రామ మంగళాశాసనం
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాభ్దయే!
చక్రవర్తి తనూజాయ సార్వ భౌమాయ మంగళం

వేదవేదాంత వేద్యాయ మేఘ శ్యామల మూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం

విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే
భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం

పిత్రు భక్తాయ సతతం భాతృభి: సహ సీతయా
నందితాఖిల లోకాయ రామ భద్రాయ మంగళం

త్యక్త సాకేత వాసాయ చిత్ర కూట విహారిణే
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం

సౌమిత్రిణాచ జానక్యా చాప బాణాసి ధారిణే
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం

దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళం

సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళం

హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే
వాలి ప్రమధ నాయాస్తు మహాధీరాయ మంగళం

శ్రీమతే రఘు వీరాయ సేతూల్లంఘిత సింధవే
జితరాక్షస రాజాయ రణ ధీరాయ మంగళం


విభీషణ కృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే
సర్వలోక శరణ్యాయ శ్రీ రాఘవాయ మంగళం

ఆగత్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా
రాజాధి రాజ రాజాయ రామ భద్రాయ మంగళం

భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే
జానకీ ప్రాణ నాథాయ రఘు నాథాయ మంగళం

శ్రీసౌమ్య జామాతృమునే: కృపయాస్మాను పేయుషే
మహతే మమ నాథాయ రఘు నాథాయ మంగళం

మంగళాశాసన పరై :మదాచార్య పురోగమై
సర్వైశ్చ పూర్వై రాచార్ర్యై : సత్కృతాయాస్తు మంగళం

రమ్యజా మాతృ మునినా మునినా మంగళా శాసనం కృతం
త్రైలోక్యాధిపతి:శ్రీమాన్ కరోతు మంగళం సదా







భావ నారాయణ స్వామీ

on 0 comments Read Full Article

ఆంధ్ర రాష్ట్రములొ వున్న పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలను కీర్తిస్తూ శ్రీ కాశిన వెంకటేశ్వర రావు గారు రచించిన గేయం .
" సర్పవరము " స్వామి నారాయణా!
సకల సంపదలిచ్చు నారాయణా!
సర్వమై నిలిచేవు నారాయణా!
భక్తినిమ్ము భావ నారాయణా!
"బాపట్ల" లో స్వామి నారాయణా!
భజనలే చేసేము నారాయణా!
బాధల్ని మాపేటి నారాయణా!
భద్రతిమ్ము భావ నారాయణా!
"భావ దేవరపల్లి" నారాయణా!
భోగ మందరికిచ్చు నారాయణా!
భవ్యముగ కీర్తించ నారాయణా!
భాష నిమ్ము భావ నారాయణా!
"పొన్నూరులో స్వామి నారాయణా!
పోగొట్టు పాపాలు నారాయణా!
పొగడగా మేమెంత నారాయణా!
భాగ్యమిమ్ము భావ నారాయణా!
"పట్టి సీమలొ " స్వామి నారాయణా!
గోదారి మధ్యలో నారాయణా!
నీసేవలే సేతు నారాయణా!
భావమిమ్ము భావ నారాయణా!
రచయితకు కృతజ్ఞ తలతో

యాగంటి

on 0 comments Read Full Article

జగదాంబ సర్వాలంకార భూషితురాలయి అంతరంగిక మందిరాగణ భూమిరజతాచల శృంగాగ్ర మధ్యప్రదేశం లొ,చలువరాతి భవంతిలొ నిత్యపూజలందుకొని "ఎవరక్కడ?"అంది.శృంగీ ,భృంగి వచ్చారు."నందీశ్వరుణ్ణి పంపండి"అంది.దండి దొర నందీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు."భరత ఖండం లొ మహావీర విజయరామ భూపాల వర్మ ఏలుబడి లొని ఎర్రమల ప్రాంతంలొ ప్రశాంతంగా,ప్రమోదంగా,ప్రశస్థంగా వుండేస్థలం కావాలి."అంది.నంది విస్తు పోయాడు."మనం అక్కడ "ఉమామహేశ్వరులవలె "పీఠం వెయ్యాలి" అంది.చిత్తం అంటూ నిష్క్రమించాడు నంది. చంద్రకాంత శిలపై యోగనిష్ట లొ వున్నాడు శివుడు.గంగాజల మణి కుంభాభి షేకం ,బిల్వార్చన,కుసుమార్చన,గంధాలంకరణ జరిగింది."ఓం నమశ్శివాయ,జగదీశ్వరాయ, సర్వేశ్వరాయ,విశ్వేశ్వరాయ,శశి శేఖరాయ,గంగాధరాయ,కందర్పహారాయ,పినాకహస్తాయ,ఉమావల్లభాయ,మహేశ్వరాయ నమోనమ: అంటూ నంది వచ్చి పాదాభివందనం చేసాడు. అరకన్ను విప్పి త్రినేత్రుడు "నందీ! ఉమ ఆజ్ఞాపించినదికదా !భక్త శిఖామణి విజయరామ భూపాలుని ముచ్చట చెల్లించడానికి మనమా ప్రాంతంలొ తిష్ట వేయకతప్పదు"అన్నాడు అపర్ణా ప్రియుడు.నంది శెలవు తీసుకొన్నాడు. * * * * * * కొసదేరిన పాటికొమ్ములు ,జింకబొడ్డు, ఎగుమలుగులు పెరిగి వాలిన చెండు,ముద్దగిట్టలు,సన్నని నాగుబామువంటి నాజూకైన తోక,మురిపెంగా ముడతపడిన గంగడోలు,మృదువయిన శరీరం ,కాటుక కళ్ళ మైల కోడె కాలుదువ్వి,రంకె వేసివనంలొ కుప్పించిదుముకుతున్నది.పులులు భయపడుతున్నాయి,పొలాలు పాడవుతున్నాయి ,గండరగండదనిపించుకొన్న కోయ దొరలు పిల్లుల్లా పొదలమాటున దాక్కున్నారు.వనసుందరి హడలిపోతున్నది. నాడు కార్తీక శుక్ల ఏకాదశి ,సోమవారం,జయలగ్నం .పండువెన్నెల వెండితీగల జలతారు తెరలు కొండగాలికి కదులుతున్నాయి.కోడె మేను పులకరించింది. కంటిని, కంటి, కంటి, కలయా ఉహూ కమ్మ్మని కొండ కోనయే గంటిని అమ్మవారికి సుఖమ్మున పీఠము వేయనైనదే గంటి,పవిత్రమైనది జగధ్ధిత కీర్తి గడించుగాక,ము క్కంటి వరాల స్వామి జనకక్ష్యకు వచ్చి పచారు సేయుతన్ అన్న వాక్కులు ఆకోడె నోటి గుండా బయలు వెడలి వనమంతా మారుమ్రోగాయి. "తథాస్తు!నందీశ్వరా !తథాస్తు,సత్యవాణి సరస్వతి నీనోటిగుండా వెలువడిన "యాగంటి,ఏగంటి"అన్న పదప్రయోగమే ఈపవిత్ర క్షేత్రానికి నామకరణ మగుగాక! అన్నది. కోడె ఏప్రాణికి అపకారం జరగకుండా ఆర్భాటం చెస్తున్నది.
విజయ రామ భూపాల వర్మ సింహాసనాధిష్టుడైనాడు.ఆస్థాన నర్తకి రాయంచలా మయూరిలా వచ్చి అంజలి ఘటించింది."ఊ పరమ శివుడు అంత రంగానికి ప్రత్యక్షం కావాలి! ప్రారంభించు"అని అజ్ఞాపించాడు ప్రభువు. జయజయ జయజయఇందుశేఖరా! నందివాహనా వందనం అభివందనంఫాల లోచనా!పన్నగభూషణా!పార్వతి వల్లభావందనం అభివందనం పినాకపాణీ!త్రిశూల ధారీ! జగద్రక్షకా!జటాప్రదీపా! వందనం అభివందనంగజచర్మాంబర ,నట గంగాధర భక్త వశంకర ,బోళాశంకర భవనాశంకర నీల కంధరాత్రిభువన సుందరావందనం అభి వందనం జయ జయ జయ జయ శంకరా అభయంకరా! జటలు సడలగా డమరు నదరగా కురంగ మెగురగా గంగదూకగా ఫణులు జారగా శూలమాడగా శశి తూగాడగ దిక్కులు కంపిల భూమి ఆకశం ప్రకంపించగా ఫాల లోచనం భగ్గు భగ్గు మని ప్రజ్వరిల్లగా ధిం ధిం ధిం ధిం ధిం తాండవార్భటిని దూకులాడగా కపాలమాలీ విభూతి భాసా వందనం అభివందనం జయ జయ జయ జయ త్రిపుర సంహారా త్రిలోక పూజ్యా! భవాశివ శంకరా! వందనం అభి వందనం నమో నమోనమో ఇంతలో ప్రజలు వచ్చి కోడెదూడ ఆగడాలు ప్రభువుకు విన్న వించారు.:ప్రజలారా!భయపడకండి.మెము మీ సుఖ్స్ శాంతుల కొసమే కొలువున్నాము.,అని పీఠం దిగీడుగు ముందుకు వేసాడు.పరివారంతోసహా రాజు అడవికి వెళ్ళి,కోడెదూడ వున్న ప్రాంతంతంలొకి వెళ్ళి,పరివారాన్ని అక్కడే వదిలి ఒక్కడె కోడె నెదుర్కొన్నాడు.కోడెకొమ్ముల తాకిడికి రాజు చేతులు చిట్లి రక్తం చిమ్మాయి.అఖండ శౌర్యం తో కోడెరామ భూపాల వర్మ మహారాజును రెండుకొమ్ములతో చెండి గగనానికి ఎగరేసింది."ఉమా మహేశ్వరా!శరణు శరణు అని రాజు వేడుకొన్నాడు.ప్రజలు,పరివారము పరుగెత్తుకు వచ్చి ఈ దృశ్యం చూసి హాహా కారాలు చేసారు.ఓంకారం హూంకరించింది.అంతా కళ్ళు తెరచి విభ్రాంతులయినారు.చదును ప్రదేశంలొ సుమారు ముప్పదియారంగుళాల పొడవు,పదునారంగుళాల వెడల్పు,పదంగుళాల దళసరి గల ఒక సుందర నీల శిలాఫలకంజేగీయ మానంగావిరాజిల్లు తూంది.ఆశిలలో ఉమా మహేశ్వర స్వరూపం స్పష్టంగా గోచరిస్తోంది.ఆ విగ్రహం ముందు నిలబడి,చేతులు పైకెత్తి ఒంటికాలిపైనిలుచున్న రాజు కంపించాడు.శివుని స్తోత్రం చేస్తున్నాడాయన.ప్రభువు దర్శనంతో ప్రజల సంతో షం కట్టలు తెంచుకొని వెల్లువ వలె పొంగింది.అప్పుడు గుర్తువచ్చింది కోడెస్వంభూ నీలశిల విగ్రహానికిసుమారు అరువది గజాల దూరంలోఇంచుమించు పండ్రెండు అడుగుల పొడవు,ఆరడుగుల వెడల్పు,నాలుగడుగుల ఎత్తుకల భ్రహ్మాండమైన ఏక శిలా నంది ప్రశాంతం గా పదుకొని వుంది.:రామ భూపాలా!నిన్ను నీప్రజలను తరింప చేయడానికి,నీచిరకాల వాంచ తీర్చడానికి నేను ఉమా ఇక్కడ ఆవిర్భవించాము.నీకొండకోనల్లో ఆగం చేసిన ఆకోడె ఎవరో కాదు సాఖాత్తు నందీశ్వరుడు."అన్నాదు శివుడు.ఇకనుంచి ఏక్షేత్రం ఏగంతి,యాగంటి గాప్రసిధ్ధి చెందుతుంది.రాజు వినయంగా తలవంచి నమస్కరించాడు."విజయరామ భూపాలా!నీబల పరాక్రమాలకు పులకరించి నేనూ ఇక్కాడే వుండిపొతున్నాను"అంది నంది హుందాగా.
అమ్మవారికి,అయ్యవారికి,నేరేడు,మామిడి ఆకులతో పందిరి వేయించు.నాను జాన కొమ్మలతోమండపం కట్టించు.ప్రతి రోజోఓ స్వామికి లక్ష బిల్వార్చన,అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరగాలి.అని చెప్పాడు.తదుపరి అగస్త్యుల వారుశ్రీ ఉమా మహేశ్వరుల విగ్రహ ప్రతిస్ఠాపన చేసారు.ఇదీ యాగంటి క్షేత్ర చరిత్ర.ఉమామహేశ్వరులు తమంత
తాముగా ప్రత్యక్షమయి నిలిచిన ఏకైక మహా క్షేత్రం యాగంటి.నమ
:
దీనిని కలిగోట్ల విజయాత్రేయగారు రచించారు.వారికి కృతజ్ఞతలు.

ఆది శంకరాచార్య జయంతి

on 0 comments Read Full Article




శ్రీ ఆది శంకరాచార్యుల వారు భారతావని లో జన్మించి మానవాళికి మహోపకారం చేసారు.అతి క్లిష్టమైన వేదాంత విషయాల్ని ఒకపక్క వివరించి, మరొకపక్క పరమ పవిత్రమైన నాలుగు పీఠాలను భారత దేశపు నాలుగు దిక్కులా స్థాపించి , మరొకపక్క ఆధ్యాత్మిక లోకపు సరిహద్దులలోకి పయనించేందుకు మెట్లుగా,దీపకళిక ల్లాగా, సులువైన తోవల్లాగా ఎన్నో స్తోత్రాలు,స్తుతులు,అష్టకాలు,రచించారు.అన్నీ మానవుల ఎదుటపెట్టి చదువుకొని తరించండి అని
దీవించారు. అతి పిన్న వయస్సులో ఆయన చేసిన రచనలు పండితులని కూడా అబ్బుర పరిచాయి. అర్ధం అయినా కాకపోయినా వేదము విన్నపుడు ఒకరక మైన శాంతి ,ఒకరక మైన తృప్తి,ఒకరకమైన పవిత్రతా భావం మనిషికి కలుగుతుంది.అలాగే శ్రీ శంకరాచార్యులవారి కవితలు చదువుతూంటే అమోఘ మైన భక్తి భావం పొంగుతుంది. విశేష మేమిటంటే ఆయన రచనలోని ఎ పదమైనా ఎక్కువ అనిపించదు,ఒక్కపదం తీసిదాని స్థానంలో మరోపదం ఎవ్వరూ పెట్టలేరు. గొప్ప కళాకారుని వలె మాటలు వజ్రాలు ,కెంపులు ,ముత్యాలు ,పచ్చలు పొదిగినట్లు పొదిగారు.
వారిని తలుచుకొని ఒక్క అష్టకం చాడువుకొందాము.

శ్రీమదచ్యుతాష్టకం

అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్ ,రామకృష్ణ పురుషోత్తమ విష్ణో ,వాసుదేవ భాగవన్ననిరుద్ద శ్రీపతే!శమయ దుఃఖ మశేషం
విశ్వ మంగళ విభో జగదీశ నందనందన నృసింహ నరేంద్ర ,ముక్తిదాయక ముకుంద మురారే!శ్రీ పతే!శమయ దుఃఖ మశేషం
రామ చంద్ర రఘునాయక దేవ దీన నాథ దురితక్షయ కారిన్
యాదవేంద్ర యదుభూషణ యజ్న శ్రీపతే!శమయ
దేవకీ తనయ దు:ఖ దవాగ్నే రాదికారమణ రమ్య సుమూర్తే!
ద:ఖ మోచన దయా ర్నవ నాథ శ్రీపతే శమయ
గోపికావదన చంద్ర చకోరా నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో
పూర్ణ రూప జయశంకర శర్వ శ్రీపతే శమయ
గోకులేశ గిరి ధారణా ధీర యామునాచ్చాతట ఖేలన వీర
నారదాది ముని వందిత పాద శ్రీపతే!శమయ దు:ఖ మశేషం
ద్వారకాధిప దురంతా గుణాబ్దే ప్రాణనాథ పరిపూర్ణ భవారే!
జ్ఞాన గమ్య గుణసాగర భ్రహ్మన్ శ్రీమతే శమయ దు:ఖ మశేషం
దుష్ట నిర్దళన దేవ దయాళో!పద్మ నాభ ధరణీ ధర ధన్విన్
రావనాన్టక రమేశమురారే!శ్రీపతే!శమయ దు:ఖ మశేషం

అచ్యుతాష్టక మిదం రమణీయం నిర్మితం భవ భయం విని హన్తుం ,య:పఠే ద్విషయ వ్రుత్తి నివృత్తిం జన్మ దు:ఖ మఖిలం స జహాతి.


ఇతి శ్రీ శంకరాచార్య విరచిత మచ్యుతాష్టక స్తోత్రం .

************************************

నిత్య ప్రార్ధన

on 0 comments Read Full Article

నిత్య ప్రార్ధన
ఒ!పరమాత్మా!దేవా!శుధ్ధ అనంత శక్తి స్వరూపా!జ్ఞాన స్వరూపా!ప్రేమమయ మూర్తీ!జ్యొతి స్వరూపా! దేవాధి దేవా!పరమ కృపా సాగరా!నమస్కారం.మళ్ళీ మళ్ళీ నమస్కారం.
ఓ!విశ్వ స్వరూపా! విశ్వాతీతా!అద్వితీయ పరమేశ్వరా !నన్ను నీవాణ్ణీ చేసుకో!పూర్తిగా నీవాణ్ణీ చేసుకో!నన్ను రక్షించు ప్రభూ!నేను నీవాడిని!నాతప్పు,ఒప్పులతో నీ శరణాగతి వేడుకొంటున్నాను.
ఓ!సర్వేశ్వరా! నా శరీరం ఆరోగ్యంగా వుండాలి.నా సర్వేంద్రియాలు పవిత్రం గా వుండాలి.నా బుధ్ధి సుస్థిరంగా వుండాలి.నాభావాలు పవిత్రం గా వుందాలి.
ఓ!ప్రభూ!నా జీవితం వికసించి,మీ సేవలొ,మీ భజనలో.మీ స్మరణలో,మీ చింతనలో గడిచిపోవుగాక!పరం దయామయా!మిమ్మల్ని దర్శించేలా,సత్యాన్ని పాటించేలా దీవించు.
ఓ!పూర్ణ స్వరూపా!నా అసంపూర్ణత్వాన్ని పూర్ణత్వంలోకి మార్చు.నన్ను నీలో చేర్చుకు పరి పూర్ణుడిని చేయి.అందరూ సద్గతిని పొందాలి.అందరూ సుఖంగా వుండాలి.అందరూ ప్రేమగా వుండాలి.అందరి జీవితాలు కల్యాణ ప్రదమవాలి.

నిజాయితీ

on 0 comments Read Full Article

నిజాయితీ
అనగనగా ఒక వూళ్ళో కట్టేలుకొట్టుకొనే అతను ఒకడు ఉండేవాడు.శీలవంతుడు,పరమార్ధం ఎరిగినవాడు,సరళ స్వభావుడు.ఇతన్ని గురించి మహమూద్ అనేరాజు విని చూడాలని పిలిపించి అతని సాదుత్వానికి ముచ్చటపడి తన రాజ్యానికి ప్రధాన మంత్రిగా నియమించాడు.కట్టెలు కొట్టుకొని బ్రతికే ఇయాజ్ కి ఈపదవిపై ఏమాత్రం మోజులేదు,అయినా రాజాజ్నని తరస్కరించలేక అంగీకరించాడు.ఇయాజ్ ప్రధాన మంత్రి కాగానే రాజ్యంలో కట్టుదిట్టాలు ఎక్కువ చేసాడు.అన్యాయాలు,అత్యాచారాలు,భ్రష్టాచారాలు అన్నీ అంతరించిపోయాయి.
స్వార్ధ పరుల ఆట కట్టే సరికి వారికి ఇయాజ్ పై ద్వేషం పెరిగి రాజుగారికి రోజూ ఒక పితూరీ ఇయాజ్ ను గురించి అందించడం ప్రారంభించారు.వాళ్ళు చెప్పిన దేమిటంటే ఇయాజ్ కి ప్రధాన మంత్రి పదవి వచ్చినప్పటినుండీ చాలా వజ్రాలు,రత్నాలు పోగుచేసాడని, రాత్రి వేల ఏకాంతంగా కూర్చుని వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటాడని.
ఇయాజ్ దాచిన ఆ సంపదని చూడాలని రాజు ఇయాజతోచెప్పాడు.ఇయాజ్ వినమ్రంగా అంగీకరించి "మీ ఆజ్ఞా పాలన చేయడం నా విధి,కానీ రాజా !మీరు వాటిని చూడాలని కోరుకోవడం మంచిది కాదు,అన్నాడు.రాజు చూడాలని పట్టు పట్టాడు."మీ ఆదేశానుసారం చూపిస్తాను,కానీ నా పై వచ్చిన ఆరోపణలు అబద్ధం అని రుజువయితే నేనేది అడిగితె అది నాకు మీరు ఇయాలి.అన్నాడు ఇయాజ్.రాజు సంతోషంగా ఇస్తాను,దానికేమి భాగ్యం?అన్నాడు.రాజుగారు ముఖ్యోద్యోగులను పిలిపించారు,అందరూ ఇయాజ్ శయన మందిరంలో గుమిగూడారు.రాజు అందరి సమక్షములో ఇయాజ్ పెట్టె తెరిచాడు.అందులో రెండు పాత వస్త్రాలున్నాయి.ఇదేమిటి?అన్నాడురాజు .
"నేను బీదరికంలోంచి ప్రధాన పదవికి వచ్చాను.అధికారంతో నాకు అహంకారం రావచ్చు,అందుకని నాపూర్వపు రోజులు మర్చిపోకుండా ఈ పాత వస్త్రాలని రోజూ చూసుకొంటూ వుంటాను,అని ఇయాజ్ సమాధాన మిచ్చాడు.రాజు పులకిత గాత్రుడై "అయితే నీకు ఏమిబహుమానం కావాలో కోరుకో!అన్నాడు."నాకేమీ అఖ్ఖరలేదు,ఈపదవినుంది విముక్తి కలిగించండి అదేచాలు,నా శేష జీవితం పరమాత్ముని పాద సేవలో గడుపుకొంటాను,అన్నాడు ఇయాజ్."సాదువర్తనులైన వ్యక్తులు ఎల్లప్పుడూ సత్యమార్గాన్నే కోరుకొంటారు"అంటుంది వేదం .
{వేద సవితనుండి}

విదురనీతి

on 1 comments Read Full Article

విదురనీతి
ధృత్యా శి శ్నోదరం రక్షేత్పాని పాదంచ చక్షుసా
చక్షు:శోత్రేచ మనసా మనో వాచంచ కర్మదా !
ధైర్యముతో కడుపును ,కామ కాంక్షను కాపాడుకోవాలి.కాలు సేతులను
కంటితో రక్షించుకోవాలి.కన్నులను,చెవులను మనస్సుతో ,మాటను
మంచి పనులతో రక్షించుకోవాలి.

శ్రవణ మహిమ

on 0 comments Read Full Article

శ్రవణ మహిమ
పరమార్ధమునకు ముఖ్య సమాధాన కారణమగు సాధనము శ్రవణము.
శ్రవణము వలన భక్తి లభించును .విరక్తి ఉత్పన్నమగును. విషయాసక్తి తగ్గి పొవును.
శ్రవణము వలన చిత్తశుధ్ధి కలుగును. బుధ్ధి ధ్రుఢ మగును. అభిమానో పాధి
తొలంగును. శ్రవణము వలన నిశ్చయము కలుగును. మమత్వము తెగిపొవును. అంత:కరణము
నందు సమాధానము జనించును. శ్రవణము వలన సందేహములు విడిపొవును. శంక లంతరించును. సద్గుణములు కలుగును. శ్రవణము వలన మనో నిగ్రహము సిధ్ధించును.
సమాధానము చేకూరును. దేహబుధ్ధి తో కూడిన బంధనములు తొలంగును. "నేను"
అను భావము దూరమగును. సందేహము దరికిరాదు. బహువిధ విఘ్నములు పటాపంచలగును.
కార్య సిధ్ధి యగును. సమాధి ఏర్పడును. మరియు పూర్ణమగు పరమ శాంతి లభించును.
సాధు సమాగమము కావించి అధ్యాత్మ శ్రవణ మొనరించుటచె వ్రుత్తి దానియందు లీనమగును. శ్రవణము వలన ప్రబొధము వ్రుధ్ధి యగును. ప్రజ్ఞ ప్రబలమగును.విషయ
పాశములు తెగిపోవును.వివేకము వచ్చును. జ్ఞానము వ్రుధ్ధినొంది బలము సమకూరును.
దాని వలన సాధకునకు వస్తు జ్ఞానము కలుగును. దుస్సాంగత్యము విడిపోవును.కామ వాసనలు క్షీణించును. ధైర్యము ప్రకాశించును. నిశ్చయాత్మకమగు సద్వస్తువు భాసమగును. శ్రవణము వలన సద్బుధ్ధి కలుగును. వివేక మతిశయించును.మనస్సు భగవంతునుయందు నాటుకొనును. మొహము నశించును. భవ భయము నాశనమగును.
ఉత్తమ గతి కలుగును. శాంతి లభించును. నివృత్తియు,అచల పదమును ప్రాప్త మగును.శ్రవణ మునకు సమాన మగు సాధన మెద్దియును లేదు.దానివలన అన్నియును సమకూరును.భవ నది తరించుటకు శ్రవణము నౌక సుమా![daasa bodha nunchi]

సంత రామదాస్

on 2 comments Read Full Article

సంత రామదాస్
సంత రామదాస్ ఒకసారి బిక్షాటన చేస్తూతిరుగుతున్నారు.
ఒక ఇంటి ముందు నిలబడి "జయజయ రఘువీర సమర్ధ " అని బిగ్గరగా కేకపెట్టారు.ఆ ఇంటి ఇల్లాలు అస్సో ఇస్సో అంటూ ఏదో పనిచేసుకొంటూంది.మధ్యలో ఈయన కేకవిని చిరాకుపడి చర్రున బయటికి వచ్చి చేతిలో వున్న అలుకు గుడ్డ పొయ్యి అలుకుతున్నది ఆయన మొహం మీద విసిరేసి"తీసుకో బిక్ష" అంది క్రోధంగా .సంత రామదాస్ సాధన్యవాదాలతో ఆ విచిత్ర బిక్ష స్వీకరించి ఆమెను ఆశీర్వదించి తన దారిన తానూ వెళ్ళిపోయాడు.ఆ బిక్షను తీసుకొని ఆయన సరాసరి నదికి వెళ్లి ఆ అలుకు గుడ్డని శుభ్రంగా వుతికారు. మఠానికి వచ్చి దానిని ఎండలో ఆరవేసి ఎండాక దానితో వత్తులు చేసి ఆవునేయితో తడిపి భగవంతునికి ఆరతి ఇచ్చేందుకు వుపయోగించారట.భగవంతుని ఇలా ప్రార్ధించారట."వట్టినుంది వచ్చే ప్రకాశం అన్ధకారాన్నేలా పారత్రోలుతుందో ఇది ఇచ్చిన అజ్నానురాలి హృదయంలోని అజ్నానాన్ధకారాన్నికూడా అలాపారత్రోలాలి ప్రభూ!"అని.ఇంకేముంది!సద భక్తుని సత్ప్రార్ధనని స్వామీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తాడా?ఇలా ప్రార్ధన చెయ్యడ మేమిటి,ఆస్త్రీ హృదయం లోని అసత్ప్రవ్రుత్తులన్ని నిశ్శేషంగా దూరమయిపోయాయి.వెంటనే ఆమె అనన్య భావంతో సంత రామదాస్ దగ్గరికి వెళ్లి తను చేసిన మహాపరాదానికి వేయి క్షమాపణలు వేడుకొంది.ఆయన చూపించిన కరుణకు ముగ్దురాలయింది.భగవద్ భక్తికి అర్హురాలయింది.పెద్ద మనసున్నవారు అపకారికి ఉపకారమే చేస్తారు.

బ్రహ్మ కృత సూర్య స్తుతి

on 0 comments Read Full Article

బ్రహ్మ కృత సూర్య స్తుతి
నమస్తే దేవ దేవేశ సహస్ర కిరనోజ్వల,
లోకదీప నమస్తేస్తు నమస్తే కోలవల్లభ
భాస్కరాయ నమో నిత్యం ఖకోల్కాయ నమో నమ: ,
విష్ణవే కాల చక్రాయ సోమాయామిత తేజసే
నమస్తే పంచకాలాయ ఇంద్రాయ వాసు రేతసే
ఖగాయ లోక నాథాయ ఏక చక్ర రాధాయచ
జగద్ధితాయ దేవాయ శివాయామిత తేజసే
తమోఘ్నాయ సురూపాయ తేజసాం నిధయే నమ:
అర్దాయ కామ రూపాయ ధర్మాయామిత తేజసే
మోక్షాయ మోక్ష రూపాయ సూర్యాయచ నమో నమ:
క్రోధలోభ విహీనాయ లోకానాం స్థితి హేతవే
శుభాయ శుభ రూపాయ శుభదాయ శుభాత్మనే
శాంతాయ శాంత రూపాయ శాంతయే స్మాసు వై నమ:
నమస్తే బ్రహ్మ రూపాయ బ్రాహ్మనాయనమో నమ:
బ్రహ్మ దేవాయ బ్రహ్మ రూపాయ బ్రాహ్మనే పరమాత్మనే
బ్రహ్మనేచ ప్రసాదం వై కురు దేవ జగత్పతే
జయ భావ జయా జేయ జయ హంస దివాకర
జయ శంభో మహాబాహో ఖగ గోచర భూధర
జయ లోక ప్రదీపాయ జయ భానో జగత్పతే
జయ కాల జయానంత సంవత్సర శుభాననా
జయ దేవాదితే: పుత్ర కశ్యపానంద వర్ధన
తమోఘ్న జయ సప్తేశ జయ శప్తాస్వ వాహన
గ్రహేశ జయ కాన్తీశ జయ కాలేశ శంకర
అర్ధ కామేశ ధర్మేశ జయ మోక్షడ శర్మద
జయ వేదాంగ రూపాయ గ్రహ రూపాయ వై నమ:
సత్యాయ సత్య రూపాయ సురూపాయ శుభాయచ
క్రోధలోభ వినాశాయ కామ నాశాయ వై జయ
కల్మాష పక్షి రూపాయ యతి రూపాయ శంభవే
విశ్వాయ విశ్వ రూపాయ విశ్వ కర్మాయ వైఇ జయ
జయోన్కార వషట్ కార స్వాహాకార స్వదామయ
జయాశ్వ మేధ రూపాయ చాగ్ని రూపార్య మాయ చ
సంసారార్ణవ పీతాయ మోక్ష ద్వారా ప్రదాయచ
సంసారార్ణవ మగ్నస్య మామ దేవ జగత్పతే
హస్తావలంబనో దేవ భవత్వం గోపతేద్భుత
నమామి దేవ దేవేశం భూతభావన మవ్యయం
దివాకరం రవిం భానుం మార్తాండం భాస్కరం భగం
ఇంద్రం విష్ణుం హరి హంసమర్క లోక గురుం విభుం
త్రినేత్రమ త్ర్యక్షరం త్రయంగం త్రిమూర్తిం త్రిగతిం శుభం
శన్ముఖాయనమో నిత్యం త్రినేత్రాయ నమో నమ:
చతుర్వింశతి పాదాయ నమో ద్వాదశ పాణయే
నమస్తే భూత పతయే లోకానాం పతయే నమ:
దేవానాం పతయే నిత్యం వర్ణానాం పతయే నమ;
త్వం బ్రహ్మ త్వం జగన్నాదో రుద్రస్త్వంచ ప్రజాపతిహి:
త్వం సోమస్త్వం తథాదిత్య స్త్వమొంకారక ఎవహి
బృహస్పతిర్బుధస్త్వం హి త్వం శుక్రస్త్వం విభావసు:
యమస్త్వం వరునస్త్వం హి నమస్తే కశ్య పాత్మజ
లయాతత మిదం సర్వం జగస్తావర జంగమం
తట్ట ఎవ సముత్పన్నం సదేవాసుర మానుషం
బ్రహ్మా చాహం చ రుద్రశ్చ సముత్పన్నో జగత్ పతే
కల్పాదౌతు పురా దేవ స్తితయే జగతోనఘ
నమస్తే వేద రూపాయ అహొరూపాయ వై నమ:
నమస్తే జ్ఞాన రూపాయ యజ్ఞాయచ నమో నమ:
ప్రసీదాస్మాసు దేవేశ భ్రుతేషు కిరనోజ్వల
సంసారార్ణవ మగ్నానాం ప్రసాదం కురు గోపతే
వేదాన్తాయ నమో నిత్యం నమో యజ్న కలాయచ







:


శ్రీ శారదా త్రిశతి స్తవ:

on 0 comments Read Full Article

శ్రీ శారదా త్రిశతి స్తవ:
ప్రాతస్మరామి తవరూప మమేయ భూషా
సందోహ రమ్య కిరనోజ్వల మంబ దివ్యం
దేదీప్యమాన శరదిందు కళా కిరీటం
దివ్యామ్బర స్రగనులేపన శోభ మానం

ప్రాత ర్వదామి తవనామ రసజ్ఞాయాగం
వాగీస్వరీతి వరదేతి సరస్వతీతి
వాణీతి వాగితి చతుర్ముఖ వల్లభేతి
శ్రీ శారదాంబ సురగీరితి భారతీతి
ప్రాతస్మరామి తవ భారతి!బాహువల్లీ
ర్వీనాక్ష సూత్ర విశ దోజ్వల పుస్తకాధ్యా :
కేయూర కంకణమనోహర దివ్య కాంతి
రాత్నాన్గులీయక కరాన్గులిరమ్య శోభా:
ప్రాతర్నమామి చరణాంబుజ మంబ !తేహం
శ్రీ శారదే !సరిత జనావన బద్ధ దీక్షం
శీఘ్రం భవంతి హి యదేవ సక్రుత్ప్రనమ్య
శీర్నా జడా ఆపి శిరో మనయే బుధానాం
ప్రాతర్ వ్రజామి శరణం ప్రనతార్తి హన్త్రీం
ప్రానేశ్వరీం భగవత: ప్రయతో విధాతు:
వీనాక్ష సూత్ర శుక పుస్తక రమ్య పాణీం
వాణీ మమూల్య సుమ మాల్య మనోజ్ఞా వేణీం
ప్రాతర్ భజామి వినత:ప్రాణ వాసన స్తాం
ప్రాజ్నై ర్వశిష్ట శుక కశ్యప నారదాద్యై
శ్రీ శారదాం శ్రుత పదాం హృది కాళిదాస
బాణాభి నంద భవ భూతి మఖైరాపిత్వాం
రచయిత
శ్రీ చింతలపాటి .వీర నీల కంట కుటుంబ రామ శాస్త్రీ సిద్ధాంతి